
మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై వస్తున్న కొత్త సినిమా పూజ కార్యక్రమం గతేడాది నవంబర్ లో జరుపుకున్న విషయం తెలిసిందే.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్(Pink Elephant Pictures) సంస్థల్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే వచ్చాయి. కానీ..తొలిసారి ఫీచర్ ఫిల్మ్ గ్రాండ్ గా తెరకెక్కించనుంది. యదు వంశీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా నుండి క్రేజీ టాక్ వినిపిస్తోంది.
యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కమిటీ కుర్రాళ్లు అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ టైటిల్ను ఏప్రిల్ ఫస్ట్వీక్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
అలాగే ఈ మూవీకి స్పెషల్గా అట్రాక్షన్ గా చెప్పుకునే విషయం ఏంటంటే..కమిటీ కుర్రాళ్లు సినిమాతో ఏకంగా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను టాలీవుడ్కు పరిచయం చేస్తోంది నిహారిక. అంతేకాకుండా ఈ సినిమాలో సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ,యశ్వంత్ పెండ్యాలతో పాటు మరికొంతమంది యూట్యూబర్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ | తాప్సీ రహస్య వివాహం..? సడెన్ గా ఎందుకిలా..
ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోల విషయానికి వస్తే..ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, అక్షయ్ శ్రీనివాస్, శివకుమార్ మట్ట మిగిలిన హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో సింగర్ అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
— Pink Elephant Pictures (@PinkElephant_P) November 11, 2023