పంజాగుట్ట, వెలుగు: ముంబై ఇండియన్స్ టీం ఓనర్, రిలయన్స్ అధినేత ముఖేశ్అంబానీ భార్య నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. సిటీలో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుంటారు.
బుధవారం రాత్రి 7:30 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆమె దాదాపు 15 నిమిషాలు అమ్మవారి సన్నిధిలో గడిపారు.