న్యూఢిల్లీ: ఏడాదిగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ స్థిరాస్తుల్లో పెరుగుదల లేదట. చరాస్తుల్లో మాత్రం కొంచెం పెరుగుదల ఉందట. పెరిగిన ఆస్తులు కూడా పశుసంపదేనట. పోయిన ఏడాది ఆయన దగ్గర 8 ఆవులు, 6 దూడలు ఉంటే…ఈ ఏడాది ఆవులు10, దూడలు 7కి ఉన్నాయట. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల ఆస్తుల స్టేట్మెంట్లో ఈ విషయం వెల్లడైంది. కొన్నేళ్లుగా కేబినెట్ మంత్రులతోపాటు సీఎం ఆస్తిపాస్తుల వివరాలను నితీశ్కుమార్ వెల్లడిస్తున్నారు. 2011 నుంచి ఈ లిస్ట్ గవర్నమెంట్ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. లేటెస్ట్ రిపోర్ట్ను మంగళవారం రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి కన్నా కేబినెట్ మంత్రులే ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నారని ఆ రిపోర్ట్ తెలిపింది.
- సీఎం ఆస్తుల విషయానికి వస్తే.. ఆయన పశువులశాలలోని పశువులు మాత్రం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెరిగాయి. పోయిన ఏడాది ఆయన దగ్గర 8 ఆవులు, 6 దూడలు ఉండేవి. ఈ ఏడాది ఆవులు10, దూడలు 7 ఉన్నట్టు రిపోర్ట్ తెలిపింది.
- నితీశ్ మంత్రుల్లో సురేశ్ శర్మ 9 కోట్లతో ఎక్కువ ధనవంతుడుగా ఉన్నారు. నీరజ్ కుమార్కు అతి తక్కువ ఆస్తులున్నాయి. ఆయన దగ్గర 35. 87 లక్షల క్యాష్ మాత్రమే ఉంది.
- ముఖ్యమంత్రి నితీశ్ కొడుకు చరాస్తుల విలువ సుమారు కోటీ 39 లక్షలు కాగా, స్థిరాస్తుల విలువ సుమారు కోటీ 48 లక్షలున్నట్టు రిపోర్ట్ తెలిపింది. ఈ ఆస్తులన్నీ తల్లి ద్వారా ఆయనకు వచ్చినవే అని రిపోర్ట్ వెల్లడించింది. నితీశ్కుమార్ భార్య గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేసి చనిపోయారు. డిప్యూటీ ముఖ్యమంత్రి సుశీల్ మోడీ ఆస్తులు కోటీ 26 లక్షలు. ఆయన భార్యకు కోటీ 65 లక్షల ఆస్తులున్నాయి.