రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు.. రేపటితో ముగింపు

రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు.. రేపటితో ముగింపు

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రెండో రోజు 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామినేషన్లను దాఖలు చేశారు. గురువారం నామినేషన్లు దాఖలు చేసినవారిలో బీజేపీ నుండి 140 మంది, సీపీఐ నుండి ఒకరు, సీపీఐ(ఎం) నుండి నలుగురు, కాంగ్రెస్ నుండి 68, ఎం.ఐ.ఎం నుండి 27, టీఆర్ఎస్ నుండి 195 మంది, టీడీపీ నుండి 47, వైఎస్సార్ సిపి నుండి ఒకరు, రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుండి 15 మంది, స్వతంత్రులు 110 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేష‌న్ వేసేందుకు అభ్యర్థుల తరపున వచ్చిన అనుచరులు, కార్యకర్తలతో రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది.