హైదరాబాద్ సిటీ, వెలుగు: ఢిల్లీ, గోవా నుంచి ఎయిర్ పోర్టు ద్వారా తరలిస్తున్న ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను శుక్రవారం ఎస్టీఎఫ్సీ టీం పట్టుకుంది. సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజు సిబ్బంది కలిసి ఎయిర్పోర్టుకి సమీపంలో ఉన్న పహాడ్ షరీఫ్ వద్ద వెహికల్స్ తనిఖీలు చేపట్టగా, 104 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ దొరికింది. దీంతో ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుకున్న మద్యం విలువ రూ. 2 లక్షల పైనే ఉంటుందని అంచనా.
