53 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరూ చేరలే

53 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరూ చేరలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది 53 డిగ్రీ కాలేజీల్లో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేదు. మరో 250 కాలేజీల్లో 50 లోపే అడ్మిషన్లు జరిగాయి. 2021–22 అకడమిక్ ఇయర్​లో మొత్తం 962 సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 4,17,740 సీట్లుంటే 2,26,403 మంది స్టూడెంట్లు చేరారు. అయితే 824  ప్రైవేటు డిగ్రీ కాలేజీలుండగా వాటిలో 53 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. 400కు పైగా కాంబినేషన్ కోర్సుల్లోనూ స్టూడెంట్లు చేరలేదు. ఇలాంటి కాలేజీలు ఓయూ, కేయూతో పాటు పలు వర్సిటీల్లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.