ఆఫీసర్ల సంతకం ఫోర్జరీ చేసి అక్రమాలు

 ఆఫీసర్ల సంతకం ఫోర్జరీ చేసి అక్రమాలు

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో భర్తల పెత్తనాన్ని నిరసిస్తూ కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ ఆఫీసు ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. హుజూర్​నగర్ మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన భర్త రవి అధికార యంత్రాంగంపై కర్రపెత్తనం చేస్తూ, అధికారుల లాగిన్ ఐడీ, పాస్​వర్డ్ దొంగిలించి ఫోర్జరీ పత్రాలతో పెద్దఎత్తున భూ కబ్జాలు చేస్తున్నారని, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు లెటర్​ద్వారా ఫిర్యాదు చేశారు. చైర్ పర్సన్ అర్చన భర్త రవితోపాటు అక్రమాలకు  పాల్పడిన కౌన్సిలర్ల భర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.