మొయినాబాద్ తహసీల్దార్అనితారెడ్డి పై బదిలీ వేటు పడింది. విధుల చేపట్టిన నాటి నుంచీ ఆమె వివాదాస్పదంగా వ్యవహరించడం ముఖ్య కారణంగా తెలుస్తోంది. పైరవీలకు పెద్దపీట వేస్తూ సామాన్యులకు అందుబాటులో లేకపోవడం తోపాటు, భూమి రిజిస్ట్రేషన్ విషయంలో కొందరికి అనుకూలంగా వ్యవహరించిందనే ఆరోపణలూ ఆమెపై ఉన్నాయి. అంతే కాకుండా అవినీతి ఆరోపణలు సైతం ఎక్కువ అవడంతో అనితా రెడ్డిపై అధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో చేవెళ్ల తహసీల్దార్ అశోక్ కుమార్ ను మొయినాబాద్ మండల తహసీల్దార్ గా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
మరిన్ని వార్తల కోసం...
RRR, KGFల కన్నా డీజే టిల్లునే పెద్ద హిట్టా..?
"హెయిర్ లైక్ మైన్" ఒబామా వీడియో వైరల్