కొడుకులు కాదన్నారని.. కలెక్టరేట్ ఆవరణలో ఉరేసుకున్నాడు

కొడుకులు కాదన్నారని.. కలెక్టరేట్ ఆవరణలో ఉరేసుకున్నాడు

భువనగిరి, వెలుగు: కన్న కొడుకులు కాదన్నారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన  శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా  కలెక్టర్ కార్యాలయం వెనుకభాగంలో చోటుచేసుకుంది.  వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన వరకంత ఎల్లారెడ్డి(60)కి 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కొడుకులు మోసపూరితంగా భూమిని పట్టా చేసుకుని తనను పట్టించుకోకుండా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని గతంలో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. శనివారం కలెక్టరేట్ లోని బి బ్లాకు ట్రెజరీ ఆఫీస్​ వద్ద గల వేప చెట్టుకు ఎల్లారెడ్డి ఉరి వేసుకొని చనిపోయాడు. గమనించిన ప్రాంగణం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు.  భువనగిరి రూరల్ సీఐ సురేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.