హైదరాబాద్: 20కిలోల ఉల్లిగడ్డలు చోరీ

హైదరాబాద్: 20కిలోల ఉల్లిగడ్డలు చోరీ

నగదు, బంగారం, విలువైన వస్తులు చోరీ కావడం చూస్తూనే ఉంటాం. అయితే వాటి జాబితాలో ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా చేరాయి. ఉల్లిరేటు భారీగా పెరగడంతో  వీటిని కూడా వదలడం లేదు  దొంగలు.  చిక్కడపల్లి  దోమలగూడలో..కూరగాయల వ్యాపారి బండి  నుంచి 20 కేజీల ఉల్లిగడ్డలను చోరీ చేశాడో దొంగ.  అర్థరాత్రి బైక్ వచ్చిన దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.  బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు పోలీసులు.