పియర్స్ పండ్లలో విటమిన్–సి, ఫైబర్ ఎక్కువ ఉంటాయి అంటోంది న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా.
ఇమ్యూనిటీ పెరగడానికి యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న విటమిన్–సి చాలా అవసరం. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర శాతం పెరగనీయదు. దాంతో డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ పండు తినొచ్చు.
పియర్స్ పండు పై పొరలో పెక్టిన్ అనే ఫైబర్ ప్రొటీన్ ఉంటుంది. ఇది హానికరమైన లో– డెన్సిటీ లిపోప్రొటీన్, ట్రైగ్లిజరైడ్స్ సంఖ్యని తగ్గిస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ పెరగదు. అంతేకాదు ఈ ప్రొటీన్ పొట్టలోని కొవ్వు పదార్థాలకు అంటుకొని వాటిని బయటకు పంపించి, కడుపుబ్బరం సమస్యని తగ్గిస్తుంది.
ఈ పండులో యుర్సోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్కి కారణమయ్యే ఎంజైమ్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇందులోని ఐసోక్వెర్సిట్రిన్ డిఎన్ఎ దెబ్బతినకుండా చూస్తుంది.