- బీఎస్పీ స్టేట్ చీఫ్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
యాదాద్రి, వెలుగు: కేసీఆర్ సర్కార్పై అన్ని వర్గాల ప్రజలు విశ్వాసం కోల్పోయారని బీఎస్పీ స్టేట్ చీఫ్ కో ఆర్డినేటర్ఆర్ఎస్ ప్రవీణ్కుమార్అన్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో గురువారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్పాలనలో అన్నివర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ విద్యను పట్టించుకోకుండా లిక్కర్ ద్వారా ఆదాయం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. కేసీఆర్ తన సొంతానికి నిర్మించుకున్న ప్రగతిభవన్ ఎదురుగా ఫుట్పాత్ను, రోడ్డును కబ్జా చేశారని ఆరోపించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఆయన అనుచరులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రజలను, ఇతర పార్టీల వారిని బెదిరిస్తున్నారన్నారు. మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో బీఎస్సీ జెండాలను టీఆర్ఎస్ వాళ్లు కూల్చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి విధానాలను వారు ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. బెదిరింపులు, దోపిడీలు ఇకముందు సాగనివ్వబోమని హెచ్చరించారు.