కోల్కతా: అంపన్ సృష్టించిన బీభత్సం నుంచి రాష్ట్రం కోలుకోవాలంటే కొంత టైం పడుతుందని, ప్రజలంతా సంయమనంతో సహకరించాలని, కొంత సమయం ఇవ్వాలని సీఎం మమతా బెనర్జీ ప్రజలను విజ్ఞప్తి చేశారు. సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం 24 గంటలు పనిచేస్తోందని ఆమె అన్నారు. ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని, కరెంటు రీస్టోర్ చయలేదని ఆరోపిస్తూ జనం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో దీదీ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై వస్తున్న దుష్ప్రచారాల్ని నమ్మొద్దని, అధికారులతో సహకరించాలని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులంతా ఆ పనుల్లో ఉన్నారని అన్నారు. చివరికి తన ఇంట్లో కూడా కరెంట్ లేదని, ఫోన్ సిగ్నల్స్ కూడా రావడం లేదని చెప్పారు. ప్రజలు ఆందోళన చేస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. ‘నా తల నరికేయండి.. అంత కంటే నేనేమీ చేయలేను” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మీని హెల్ప్ అడిగానని ఆమె చెప్పారు. పశ్చిమబెంగాల్లో అంపన్ తుపాను బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో దాదాపు రూ.లక్ష కోట్ల నష్టం జరిగిందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 89 మంది చనిపోయారు. నార్త్ 24 పనగణాలు, కోల్కతా, సౌత్ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ సహా మరో 14 జిల్లాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకోవడం ఆరోపిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు.
దయచేసి సహకరించండి: బెంగాల్ ప్రజలకు దీదీ విజ్ఞప్తి
- దేశం
- May 24, 2020
లేటెస్ట్
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
- Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?
- ఆటగాడే : స్పీచ్ థెరపీతో ముగ్గులోకి దింపి.. మూడో పెళ్లి.. బాధితురాలి ఆందోళన
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన