పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్

పోలీసుల అదుపులో  బీఆర్ఎస్ నేత క్రిశాంక్

బీఆర్ఎస్ నేత  క్రిశాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి హైద్రాబాద్ వెళ్తున్న క్రిశాంక్ కారును  పతంగి టోల్ ప్లాజా దగ్గర  ఆపి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి చౌటుప్పల్ పీఎస్ కు తరలించారు. ఓయూ వీసీ పేరుతో ఫేక్ లెటెర్ తయారు చేసినట్లు  ఏప్రిల్ 30న హైదరాబాద్ లో క్రిశాంక్ పై కేసు  నమోదు చేశారు. ఉస్మానియా యూనివర్శిటీని సోషల్ మీడియాలో  డ్యామేజ్ చేశారని  వర్శిటీ అధికారుల ఫిర్యాదుతో క్రిశాంక్ పై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. 

 కేటీఆర్ ప్రెస్ మీట్ కు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా కారును పతంగి చెక్ పోస్టు దగ్గర అడ్డుకున్నారని చెప్పారు. ఉన్నతాధికారులు వస్తున్నారని చెప్పారు చాలా  సేపు నిలబెట్టారని తెలిపారు. తర్వాత చౌటుప్పల్ పీఎస్ కు   తీసుకెళ్లారని చెప్పారు.