పోలీసులు, గ్రామస్తులకు మధ్య గొడవ.. కానిస్టేబుల్ మృతి

 పోలీసులు, గ్రామస్తులకు మధ్య గొడవ.. కానిస్టేబుల్ మృతి

బిహార్ లోని జెహానాబాద్ సమీపంలోని నెహాల్ పూర్ లో పోలీసులు, గ్రామస్తులకు గొడవ జరిగింది. ఈ గొడవల్లో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు  కోల్పోయారు. అక్రమంగా మద్యం అమ్ముతున్నారని నిన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి పోలీసు కస్టడీలోనే అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు నేషనల్ హైవేపై రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ధర్నా చేస్తున్న వారిని ఖాళీ చేయించే సమయంలో కొందరు గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విసిరారు. కాసేపట్లోనే అది మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులను పరుగెత్తించి మరీ కొట్టారు స్థానికులు. ఈ క్రమంలో ఓ మహిళా పోలీస్ చనిపోయారు. దీంతో పోలీసులు గ్రామస్తులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో గ్రాస్తులు పొలాల వెంట పరుగులు పెట్టారు. దీంతో పొలాల్లోకి వెళ్లిన వారిని సైతం అరెస్ట్ చేశారు పోలీసులు.