బీజేపీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత

బీజేపీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. నగరంలో జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో బీజేపీ ఆఫీస్ కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యాలయనికి వచ్చే రెండు దారులను పోలీసులు మూసివేశారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయనికి వచ్చే అవకాశం ఉందనే ముందస్తు సమాచారంతో  భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్లు, ముండ్ల కంచెలతో, స్పెషల్ ఫోర్స్ తో బీజేపీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.