ఫోన్ ట్యాపింగ్ కేసు.. మీడియా ఛానల్ ఎండీ ఇంట్లో సోదాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. మీడియా ఛానల్ ఎండీ ఇంట్లో సోదాలు

ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో  విచారణ ప్రక్రియ కొనసాగుతోంది.లేటెస్ట్ గా హైదరాబాద్ జూబ్లీహిల్ల్ లోని ఓ తెలుగు మీడియా ఛానల్ ఎండీ  శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో పోలీసులు దాదాపు ఐదు గంటలు సోదాలు చేశారు.  శ్రవణ్ కుమార్ రావ్ ఇంట్లో కీలక సమాచారం సేకరించారు. 

మరో వైపు  ప్రణీత్ రావు కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.  ఈరోజు విచారణ అనంతరం ప్రణీత్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రణీత్ రావు స్టేట్ మెంట్  కాపీని కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు.  తనకు సహకరించిన వారి అందరి పేర్లు విచారణలో ప్రణీత్ రావు చెప్పినట్లు సమాచారం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంత మందిని పోలీసులు విచారించే అవకాశం ఉంది.
 

తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రణీత్‌‌‌‌ రావు సవాల్‌‌‌‌ చేసిన పిటిషన్‌‌‌‌ ను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రణీత్ రావు అరెస్ట్ రూల్స్ ప్రకారమే జరిగిందని తెలిపింది.