పొంగల్‌ గిఫ్ట్‌ ప్రకటించిన తమిళ సీఎం

పొంగల్‌ గిఫ్ట్‌ ప్రకటించిన తమిళ సీఎం

చెన్నై: తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఆ రాష్ట్ర ప్రజలకు పొంగల్‌ గిఫ్ట్‌ ప్రకటించారు. బియ్యం, చక్కెర, పొడి ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు, చెరకుతో కూడిన బట్టల సంచిలో రూ.2,500 నగదు కూడా ఉంటుందని తెలిపారు. బియ్యం పొందే 2.06 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు పొంగల్ గిఫ్ట్ హాంపర్లు అందజేస్తామని చెప్పారు. సేలం జిల్లాలోని తన అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఆయన ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపర్చినట్లు తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పొంగల్‌ గిఫ్ట్‌ను ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు.