ఏరియా ఆసుపత్రుల్లో రోగులకు భరోసా
సింగరేణి ఏరియా హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ప్లాంట్లలో ఉత్పత్తి స్టార్ట్అయ్యింది. కరోనా టైంలో తీవ్ర ఆక్సిజన్కొరత ఏర్పడడంతో సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఐదు ఏరియా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ప్లాంట్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సింగరేణి ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్సిలిండర్లను మహారాష్ట్రలోని నాగపూర్, హైదరాబాద్, పాల్వంచ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేవారు. కరోనా టైంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆక్సిజన్సిలిండర్లపై అక్కడి ఆఫీసర్లు ఆంక్షలు విధించడంతో సింగరేణి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆక్సిజన్ఉత్పత్తి కేంద్రాలపై ఆధారపడింది. ఆక్సిజన్కొరత కారణంగా రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో యాజమాన్యం ముందస్తు చర్యలకు దిగింది. ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి వ్యాప్తంగా ఐదు ప్రధాన ఆసుపత్రులతో పాటు మరో ఐదు 10 పడకల ఆసుపత్రులున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్మెంట్కోసం నెలకు 110 ఆక్సిజన్ సిలిండర్లు అవసరమయ్యేవి. ఈ నేపథ్యంలో రూ.3.63 కోట్లు ఖర్చు చేస్తూ రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం ఆసుపత్రుల్లో 12 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ ఆక్సిజన్ప్లాంట్లు, గోదావరిఖనిలో 45 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ ప్లాంటు పనులు చేపట్టింది.
మంచిర్యాల జిల్లాలో ఉత్పత్తి షురూ
మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్, బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి షురూ చేసింది. ఒక్కో ప్లాంట్నిర్మాణానికి రూ. 35 లక్షల వరకు వెచ్చించారు. ఆక్సిజన్ ప్లాంట్మిషనరీ టర్కీ నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండు చోట్లా 12 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ (నిమిషానికి 200 లీటర్ల ఉత్పత్తి)తో రోజుకు 40 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగనుంది. గత నెల 30న సింగరేణి డైరెక్టర్(ఫైనాన్స్, పీపీ) బలరాం, సత్యనారాయణ(ఈఎం) వీటిని ప్రారంభించారు. ప్లాంట్లలో ఉత్పత్తయిన ఆక్సిజన్ను సెంట్రలైజ్డ్ పైప్లైన్ద్వారా ఆసుపత్రుల్లోని వార్డుల్లో ట్రీట్మెంట్పొందుతున్న రోగులకు నిరంతరాయంగా సప్లై చేస్తున్నారు.
ఆక్సిజన్ కొరత రాకూడదని..
కరోనా విపత్కర పరిస్థితు ల్లో కూడా రోగులకు ఆక్సి జన్ కొరత రాకుండా చూశాం. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత ఉండ కూడదనే సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సింగ రేణి సీఎండీ శ్రీధర్ చొరవ చూపారు. ప్రస్తుతం రోజుకు 40 సిలిండర్ల ఆక్సిజన్ఉత్పత్తి అవు తోంది. ప్లాంట్ల ఏర్పాటుతో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగులకు మరింత భరోసా కలుగుతుంది.
.. డాక్టర్ ఉషారాణి, డీవైసీఎంవో, రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి