జీవో 317ను గత సర్కార్ పట్టించుకోలేదు : ప్రొఫెసర్ కోదండరాం

జీవో 317ను గత సర్కార్ పట్టించుకోలేదు  :  ప్రొఫెసర్ కోదండరాం

ఖైరతాబాద్, వెలుగు: జీవో 317 తో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడినది వాస్తవమేనని, గత ప్రభుత్వం  పట్టించుకోలేదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జీవో పట్ల కాంగ్రెస్  ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమస్యను గుర్తించిందన్నారు. జీవో 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో అభినందన, కృతజ్ఞత సభ నిర్వహించారు. 

ప్రొఫెసర్ కోదండరాం పాల్గొని మాట్లాడుతూ ఒక్క కొత్త జిల్లాలో అదనపు మండలాలు చేర్చడంతో స్థానికత సమస్య వచ్చిందన్నారు. టీ పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. జీవో 317 పై ఎన్నిసార్లు పోరాటం చేసినా గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉద్యోగులు ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందని విమర్శించారు. జీవో పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారన్నారు. జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సెక్రటరీ దత్తాద్రి పాల్గొన్నారు.