బస్సుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించని జనం

బస్సుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించని జనం

లాక్డౌన్ వల్ల దాదాపు 56 రోజులుగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా లాక్డౌన్ నిబంధనల్లో కేంద్రం ఇచ్చిన సడలింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం బస్సులు నడపాలని సోమవారం జరిగిన కెబినేట్ మీటింగ్ లో నిర్ణయించింది. దాంతో మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కాయి. బస్సులన్నింటిని శానిటైజ్ చేసిన తర్వాతే డిపో నుంచి బయటకు తీస్తున్నారు. డ్రైవర్, కండక్టర్ తప్పని సరిగా మాస్కు ధరించాలని డిపో మేనేజర్లు సూచిస్తున్నారు. ప్రయాణికులు కూడా మాస్కులు ధరించాలని నిబంధన ఉంది. అంతేకాకుండా.. ప్రయాణికులు బస్సుల్లో భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ప్రయాణికులు మాత్రం ఆ నిబంధనను పెడచెవిన పెడుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌ రీజియన్‌ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి 960 బస్సులను నడిపిస్తున్నట్లు వరంగల్ 2 డిపో మేనేజర్ భానుకిరణ్ తెలిపారు. వరంగల్ నుంచి హైదరాబాద్ రూట్ లో 200 బస్సులను నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ఆర్టీసీలో అద్దె బస్సులను కూడా నడిపిస్తామని ఆయన అన్నారు.

For More News..

నేను కూడా ఆ డ్రగ్ తీసుకున్నా..

ఇక్కడెందుకు కూర్చున్నారన్నందుకు కాల్చి చంపిన దుండగులు

కిస్సింగ్ వీడియో వైరల్.. యువతుల్ని చంపేసిన కుటుంబసభ్యులు

విడాకులకు దరఖాస్తు చేసిన ప్రముఖ నటుడి భార్య