ఇండ్ల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ..

 ఇండ్ల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ..
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ వైన్ షాప్ తొలగించాలని డిమాండ్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : ఇండ్ల మధ్యలో మద్యం దుకాణం పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు, అదికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. రేగొండ - చిట్యాల వేళ్లే రహదారి పై ఇండ్ల మధ్యలో న్న మద్యం దుకాణం ఎత్తి వేయాలని వారు డిమాండ్ చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు బడికి వెళ్లాలన్నా,  బయటికి రావాలి అన్నా ఇబ్బందులు పడుతున్నామన్నారు. మద్యం తాగిన వారు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని, మద్యం మత్తులో రోడ్ల పక్కన పడిపోతుంటే.. మరికొందరు ఇళ్ల ముందు మల మూత్ర విసర్జన చేస్తున్నారని వాపోయారు. చర్చికి 20 మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాన్ని ఎలా అనుమతిస్తారని పోలీసులను, సర్పంచును ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. సీఐకి నేరుగా ఫోన్ చేస్తే నిస్సహాయంగా చేతులెత్తేశారని.. అందుకే గత్యంతరం లేక.. మరో మార్గం తెలియక రోడ్డెక్కి నిరసన చేపట్టామన్నారు. తమ పిల్లలు, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని ఇండ్ల మద్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని వారు కోరారు.