కామారెడ్డి, భిక్కనూరు, వెలుగు: కేంద్ర పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్క దారి పట్టిస్తున్నదని కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుపు కోసం క్యాడర్ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా శనివారం కామారెడ్డి జిల్లా దోమకొండ, భిక్కనూరు మండలాల్లో ఆయన పర్యటించారు. దోమకొండ మండల కేంద్రంలో ని 102 బూత్లో కేంద్ర మంత్రి ఇంటింటికీ తిరుగుతూ పాంప్లెంట్లు పంపిణీ చేశారు.
ప్రభుత్వ స్కీంలను స్థానికులకు వివరించారు. భిక్కనూరులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. పార్టీ స్థాపించిన కొత్తలో డిపాజిట్ వస్తే చాలని అనుకునే వాళ్లని, కానీప్పుడు భారీ మెజార్టీతో కేంద్రంతో పాటు, అనేక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నామన్నారు. అప్పట్లో ఈ ఏరియాలో టైగర్ నరేంద్ర ఒకరే ఉండేవారని కానీప్పుడు చాలా మంది ఉన్నారన్నారు. కేంద్ర పథకాలు, అభివృద్ధి పనులను పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి వివరించాలన్నారు. పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ మండల ప్రెసిడెంట్ రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.