కేసీఆర్.. బీసీ వ్యతిరేకి

కేసీఆర్.. బీసీ వ్యతిరేకి
  • ఎంపీ ఆర్.కృష్ణయ్య ఫైర్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలను మోసం చేస్తూ సీఎం కేసీఆర్ బీసీల వ్యతిరేకిగా మారారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. బీసీలను మోసం చేసేందుకే కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం స్కీం తెచ్చారని ఆరోపించారు. శుక్రవారం విద్యానగర్​లోని బీసీ భవన్​లో బీసీ సంఘాల సమావేశం జరగగా.. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం కేవలం14  బీసీ కులవృత్తులకే లక్ష సాయం ఇస్తామంటోందని, బీసీ జాబితాలోని 130 కులాలకు ఈ స్కీమ్ ను  అమలు చేయాలని డిమాండ్ చేశారు.  గతంలో ఇచ్చిన బీసీ బంధు హామీ ఏమైందని కృష్ణయ్య ప్రశ్నించారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్​ నీల వెంకటేశ్, బీసీ సంఘాల నేతలు ఎర్ర సత్యనారాయణ, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.