ప్రజాస్వామ్య తెలంగాణ జేఏసీ ఏర్పాటుకు తీర్మానం

ప్రజాస్వామ్య తెలంగాణ జేఏసీ ఏర్పాటుకు తీర్మానం

ఖైరతాబాద్​, వెలుగు : నవ తెలంగాణ నిర్మాణంలో ప్రజాస్వామిక తెలంగాణ జేఏసీ ఏర్పాటుకు ప్రజాసంఘాలు, మేధావులు ,ఉద్యమకారులు, జర్నలిస్టు  సంఘాలు నిర్ణయించాయి.  ‘నవ తెలంగాణ నిర్మాణం– సవాళ్లు’ అంశంపై సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో శుక్రవారం రౌండ్ టేబుల్​మీటింగ్ జరిగింది.  సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్​ పీఎల్​ విశ్వేశ్వరరావు, జర్నలిస్టు కోటేశ్వరరావు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. 

ఉమ్మడి కార్యాచరణకు ‘ప్రజాస్వామ్య తెలంగాణ జేఏసీ’గా నామకరణం చేస్తూ  తీర్మానించారు.  ప్రజాస్వామిక  జేఏసీ సభ్యులుగా  జస్టిస్​ చంద్రకుమార్, పాశం యాదగిరి, పీఎల్​విశ్వేశ్వరరావు, కోటేశ్వరరావు, సొగరా బేగం, ప్రొఫెసర్​  ఖాసిం, నజియా సిఖిందర్, రాయగిరి ప్రకాష్​, తెలంగాణ జనార్దన్, రమాదేవి, రోజా నీత, అంబు రాథోడ్​ను నిర్ణయించారు.