ఖైరతాబాద్, వెలుగు : నవ తెలంగాణ నిర్మాణంలో ప్రజాస్వామిక తెలంగాణ జేఏసీ ఏర్పాటుకు ప్రజాసంఘాలు, మేధావులు ,ఉద్యమకారులు, జర్నలిస్టు సంఘాలు నిర్ణయించాయి. ‘నవ తెలంగాణ నిర్మాణం– సవాళ్లు’ అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం రౌండ్ టేబుల్మీటింగ్ జరిగింది. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, జర్నలిస్టు కోటేశ్వరరావు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
ఉమ్మడి కార్యాచరణకు ‘ప్రజాస్వామ్య తెలంగాణ జేఏసీ’గా నామకరణం చేస్తూ తీర్మానించారు. ప్రజాస్వామిక జేఏసీ సభ్యులుగా జస్టిస్ చంద్రకుమార్, పాశం యాదగిరి, పీఎల్విశ్వేశ్వరరావు, కోటేశ్వరరావు, సొగరా బేగం, ప్రొఫెసర్ ఖాసిం, నజియా సిఖిందర్, రాయగిరి ప్రకాష్, తెలంగాణ జనార్దన్, రమాదేవి, రోజా నీత, అంబు రాథోడ్ను నిర్ణయించారు.