హ్యూమన్ ట్రయల్స్ పై పూర్తి డేటా వెలుగులోకి రాకుండా ఎలాంటి నివేదికలివ్వొద్దని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా కోరారు.
సీరం ఇండియా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ పై రోగుల గురించి పూర్తి డేటా రాకముందే ఎలాంటి నివేదికలను ఇవ్వొద్దంటూ కోరారు. ఈ ప్రక్రియను గౌరవించాలని, పక్క దారి పట్టించవద్దంటూ ఆయన ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం కోసం రెండు నెలలు ఓపికగా ఉండాలని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా కోరారు.