రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి

రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర‌ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థ‌సార‌థి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. ఈ ప‌దవిలో పార్థ‌సార‌థి మూడేళ్ల‌ పాటు కొన‌సాగనున్నారు. పార్థసారథి 1993 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి స్థాయిలో పని చేసి రిటైరయ్యారు. అగ్రికల్చర్‌ ఎమ్మెస్సీ చేసిన పార్థ‌సార‌థి.. ఆదిలాబాద్‌ డీఆర్‌డీఏ పీడీగా కె రీర్‌ను ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డాక రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డిని నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం ఇప్పుడు పార్థ‌సార‌థిని నియ‌మించింది.