ఒకే ప్రాంతం,ఒకే టైంలో బీజేపీ,టీఎంసీ పార్టీల ర్యాలీలు

ఒకే ప్రాంతం,ఒకే టైంలో బీజేపీ,టీఎంసీ పార్టీల ర్యాలీలు

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ప్రధాన ప్రత్యర్థులైన అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC), భారతీయ జనతా పార్టీ(BJP)లు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే రేపు(శనివారం) ఈ రెండు పార్టీలు ఒకే ప్రాంతంలో ర్యాలీలు చేపట్టనుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నదియా జిల్లాలోని నబాద్వీప్‌ ప్రాంతంలో ‘పరివర్తన్‌ రథయాత్ర’ పేరుతో పార్టీ చేపట్టనున్న ర్యాలీని ఆయన ప్రారంభించనున్నారు. అయితే అదే ప్రాంతంలో తృణమూల్‌ యూత్‌ కాంగ్రెస్‌ కూడా ర్యాలీకి పిలుపునిచ్చింది. శనివారం నుంచి రెండు రోజుల పాటు నదియా జిల్లా వ్యాప్తంగా జనసమర్థన్‌ యాత్ర పేరుతో మోటార్‌ సైకిళ్లతో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో నదియా అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.