పశువులను అడవిలో మేపినందుకు రూ. 2 లక్షల ఫైన్

పశువులను అడవిలో మేపినందుకు రూ. 2 లక్షల ఫైన్

అమ్రాబాద్, వెలుగు: పశువులను అడవిలో మేపినందుకు ఫారెస్ట్​ ఆఫీసర్లు రూ. 2 లక్షల ఫైన్​వేశారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లికి చెందిన కొందరు పశువులను మేపేందుకు వేసవిలో ఆంధ్ర ప్రాంతానికి వెళ్లారు. కొద్దిరోజుల క్రితం నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్ ​టైగర్ ​రిజర్వ్​ఫారెస్ట్​మద్దిమడుగు రేంజ్ పరిధిలోకి ఎంటర్ అయ్యారు. గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు గురువారం ఉదయం ఫీల్డ్ కు వెళ్లి అశోక్, అంజి అనే ఇద్దరు పశువుల కాపరులను అదుపులోకి తీసుకున్నారు.  శుక్రవారం పశువుల ఓనర్లను రప్పించారు. టైగర్ రిజర్వ్​పరిధిలోని కోర్ ఏరియాలో దాదాపు రెండు వేల పశువులను ఉంచి అడవిలోని వన్యప్రాణుల ఆస్తికి నష్టం కలిగించారని మండిపడ్డారు. రెండు మందలకు రూ. రెండు లక్షలు చెల్లించాలని చెప్పారు. లేకపోతే పశువుల కాపర్లపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.