హైదరాబాద్, వెలుగు: ఖోస్లా వెంచర్స్, ఎయిర్టెల్ వంటి పెట్టుబడిదారుల మద్దతు గల బ్లూ కాలర్ రిక్రూటర్ వాహన టెక్నాలజీస్, హైదరాబాద్లో బ్లూ కాలర్ రిక్రూట్మెంట్పై సెమినార్ను నిర్వహించింది. ఫుడ్ డెలివరీ, క్విక్ సర్వీస్, ఈ–-కామర్స్, తయారీ వంటి పరిశ్రమల నుంచి టెంపరరీ కార్మికులకు డిమాండ్ పెరుగుతోందని తెలిపింది. బ్లూ-కాలర్, గిగ్ రిక్రూట్మెంట్ను పెంచుతామని తెలిపింది.
ఈ సంస్థ సప్లై అక్విజిషన్ హెడ్ సిద్ధార్థ్ చౌహాన్ మాట్లాడుతూ బ్లూ-కాలర్ ఉపాధిలో సవాళ్లను పరిష్కరించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం, 2030 నాటికి గిగ్వర్కర్ల సంఖ్య 2.35 కోట్ల మందికి చేరుతుంది. 2020–2030 మధ్య వీరి సంఖ్య 200శాతం వృద్ధి చెందుతుంది. ఉద్యోగ భద్రత లేని కార్మికులను గిగ్వర్కర్లు అంటారు.