ముంబై : 2013 నాటి సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులకు విధించిన మరణశిక్షను బాంబే హైకోర్టు జీవిత ఖైదుగా మార్చింది. 2013లో ముంబైలోని శక్తి మిల్స్లో ఫోటో షూట్ కోసం ఓ వ్యక్తితో కలిసి వెళ్లిన 22 ఏళ్ల ఫోటో జర్నలిస్ట్పై ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు విజరు జాదవ్, మొహమ్మద్ ఖాసిమ్ షేక్, మొహమ్మద్ అన్సారీలు ఈ నేరానికి పాల్పడ్డారు. వారు పశ్చాత్తాప పడేందుకు జీవిత ఖైదు సరైన శిక్ష అని డివిజన్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అత్యాచారం మానవ హక్కుల ఉల్లంఘన అని, ఈ నేరం సమాజంలోని పలువురిని మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురిచేసిందనే వాస్తవాన్ని విస్మరించలేమని జస్టిస్ సధనా జాదవ్, పృధ్వీరాజ్ చవాన్లు పేర్కొన్నారు. మరణ శిక్షతో పశ్చాత్తాపానికి అవకాశం ఉండదని ధర్మాసనం పేర్కొంది. దోషులను పెరోల్ మీద సమాజంలో తిరిగేందుకు అనుమతించకూడదని అన్నారు. అయితే కేవలం ప్రజాగ్రహం తీర్పు ను ప్రభావితం చేయరాదని వ్యాఖ్యానించింది. నిందితుల్లో ముగ్గురు మరో సామూహిక లైంగిక దాడి కేసులోనూ దోషులుగా తేలడం గమనార్హం.
జర్నలిస్ట్ అత్యాచారం కేసు: శిక్షను మార్చేసిన హైకోర్టు
- దేశం
- November 25, 2021
లేటెస్ట్
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
- టెస్కో ద్వారా శానిటరీ నాప్కిన్ తయారీ యూనిట్లు : మంత్రి తుమ్మల
- Nagababu: X(ట్విట్టర్) నుండి మెగా బ్రదర్ నాగబాబు అవుట్.. కారణం ఏంటంటే?
- ఆటగాడే : స్పీచ్ థెరపీతో ముగ్గులోకి దింపి.. మూడో పెళ్లి.. బాధితురాలి ఆందోళన
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన