క్రేజీ కాంబినేషన్ తో ఫిదా చేసిన శేఖర్ కమ్ముల

క్రేజీ కాంబినేషన్ తో ఫిదా చేసిన శేఖర్ కమ్ముల

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కొత్త సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ బ్రాండ్ తో రిలీజై సూపర్ హిట్ అయిన ఫిదా తర్వాత ఆయన తీయబోయే సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి ఏర్పడింది. ఆ అంచనాలను నిలబెడుతూ… ఈసారి క్రేజీ కాంబినేషన్ తో వస్తున్నారు. అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ సినిమా రూపొందిస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మూవీ టీమ్.

నాగ చైతన్య కెరీర్ లో ఇది 20వ సినిమా. ఫిదాతో క్రేజ్ ను పెంచుకున్న సాయిపల్లవినే ఫిమేల్ లీడ్ గా తీసుకున్నారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ మొదలవుతుంది. డిసెంబర్ లో ఈ మూవీని విడుదల చేస్తామని మూవీ టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించారు.