తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా

తెలంగాణలో మరో ఆరుగురికి కరోనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గురువారం ఆరు కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో నాలుగు, మెదక్ లో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో మరో కేసు నమోదు అయిందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 925 మందికి టెస్టులు చేస్తే, ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని చెప్పింది. ఈ ఆరుగురితో కలిపి ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య19కి చేరుకుందని పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది.