కొడిమ్యాల, వెలుగు : అత్తగారింట్లో ఉన్న తన భార్యను కాపురానికి పంపడం లేదని ఓ అల్లుడు తన అత్తను మంగళవారం కట్టెతో తలపై కొట్టి హత్య చేశాడు. జగిత్యాల కొడిమ్యాల మండలం కోనాపూర్ విలేజ్ కు చెందిన జడ రాజవ్వ(50)కు ఇద్దరు బిడ్డలున్నారు. భర్త కొమురయ్య గతంలోనే చనిపోగా, ఇద్దరి బిడ్డల పెండ్లిళ్లు చేసింది. చిన్న బిడ్డ మౌనికను నాలుగేండ్ల కింద కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన మేనల్లుడు ఔరగొండ గంగాధర్ కు ఇచ్చి మ్యారేజ్ చేసింది. ఆరు నెలల కింద గంగాధర్ దుబాయ్కి పోగా అప్పటి నుంచి భార్య మౌనిక తల్లి ఇంటికి వచ్చి ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం అత్త ఇంటికి వచ్చిన గంగాధర్తన భార్యను కాపురానికి పంపాలని కోరాడు. ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంలో అత్తకు, మేనల్లుడికి గొడవ జరగడంతో ఆవేశంతో పక్కనే ఉన్న కట్టెతో రాజవ్వ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మాల్యాల సీఐ రమణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పురుషోత్తం చెప్పారు.
భార్యను పంపడం లేదని అత్తను చంపిండు
- తెలంగాణం
- December 29, 2021
లేటెస్ట్
- చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
- హెరాయిన్, డ్రగ్స్ సప్లై ముఠా అరెస్ట్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- హైదరాబాద్లో రికార్డు విద్యుత్ వాడకం
- హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నరు : తన్నీరు హరీశ్రావు
- తల్లి, అక్క మందలించారని సూసైడ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- అర్హత లేకున్నా డాక్టర్గా చలామణి..ఆర్ఎంపీని పట్టుకున్న ఆఫీసర్లు
- మంచు విష్ణు కన్నప్పలో కాజల్
- ఫస్ట్ ఫేజ్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- Weather Alert : వర్షాలు పడ్డాయని కూల్ అయ్యారా.. వచ్చే 4 రోజులు మాడు పగిలిపోయిద్ది..