బల పరీక్షకు సిద్ధం కాకపోతే.. నేనే రాజీనామా చేస్తా: స్పీకర్

బల పరీక్షకు సిద్ధం కాకపోతే.. నేనే రాజీనామా చేస్తా: స్పీకర్

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  బలనిరూపణకు  సీఎం కుమార స్వామికి  డెడ్ లైన్ విధించారు స్పీకర్ రమేష్ కుమార్. సోమవారం రాత్రి 9 గంటల వరకు  బలనిరూపణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పదే పదే గడువు పెంచమని కోరితే తానే రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. సుప్రీం కోర్టులో  తమ పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తమకు మరో రోజు గడువు ఇవ్వాలని జేడీఎస్ నేతలు కోరినప్పటికీ స్పీకర్ ఒప్పుకోలేదు.ఎట్టి పరిస్థితుల్లో బల పరీక్షకు రెడీ కావాలని అన్నారు.