పోతురాజు దినేష్ ఇక లేరు

పోతురాజు దినేష్  ఇక లేరు

హైదరాబాద్ లో బోనాలు ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఈ బోనాల పండుగలో ఒళ్లంతా పసుపు పూసుకుని చేతిలో కొరడా పట్టకుని.. బోనం వెంట నడుస్తూ చిత్ర విన్యాసాలు చేసే పోతురాజులు  మనకు కనిపిస్తుంటారు. అయితే  సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో అమ్మవారికి పోతురాజు వేషం వేసే దినేష్ ఇకలేరు. గత  కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దినేష మే 6వ తేదీన తుదిశ్వాస విడిచారు. సోషల్ మీడియాలో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు.  దినేష్ గత 21 సంవత్సరాలుగా పోతురాజు వేషం వేస్తున్నాడు. అమ్మవారే తనను  పోతురాజు వేషం కట్టమని చెప్పిందని.. అప్పటినుంచి ఇలా చేస్తున్నానని తెలిపాడు.    35 ఏళ్ల దినేష్ చక్రవాకంతో పాటుగా పలు సీరియల్స్ లో కూడా నటించాడు.