బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్‌

బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్‌

బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి ఆ పార్టీకి రాజీనామా  చేశారు. వెంటనే  కాంగ్రెస్ లో చేరిపోయారు.  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్‌ రెడ్డి.  బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి  మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు.  

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థిగా పోటీ  చేసిన ఈయన పొన్నం ప్రభాకర్ చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. మరో వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనుకున్న క్రమంలో బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి పార్టీ మారటం బీజేపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మంచి ఆప్తుడిగా  బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తికి పేరుంది.