మందలించారని బిల్డింగ్ పైనుంచి దూకేసిండు
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
బాసర, వెలుగు: వర్సిటీ ఆఫీసర్లు మందలించడంతో బాసర ట్రిపుల్ఐటీ స్టూడెంట్ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. బుధవారం తను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకేసిండు. అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి, తర్వాత హైదరాబాద్కు తరలించారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లికి చెందిన బోండ్ల సంజయ్.. బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్టియర్ చదువుతున్నడు.
మంగళవారం ఓ స్టూడెంట్తో సంజయ్ గొడవపడ్డాడు. ఆ స్టూడెంట్ దీన్ని వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు విచారణ జరిపారు. బుధవారం సంజయ్ పేరెంట్స్కు ఫోన్ చేసి పిలిపించారు. మాట్లాడుతుండగా టాయ్లెట్ వెళ్లొస్తానని చెప్పి సంజయ్హాస్టల్కు వెళ్లాడు. బిల్డింగ్ పైకెక్కి దూకాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి.