స్వగృహ అపార్ట్​మెంట్ల లాటరీ..

స్వగృహ అపార్ట్​మెంట్ల లాటరీ..
  • 27, 28, 29 తేదీల్లో.. యూట్యూబ్, ఫేస్‌‌బుక్​లో లైవ్
  • పారదర్శకంగా కేటాయిస్తాం: హెచ్ఎండీఏ

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ల ఫ్లాట్ల లాటరీ తేదీలను హెచ్ఎండీఏ శనివారం ప్రకటించింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో లాటరీ తీయనున్నట్లు వెల్లడించింది. ఈనెల 27న పోచారం, 28న బండ్లగూడ (త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ మినహా), 29న బండ్లగూడ త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్ల లాటరీ తీయనున్నారు. మొత్తం 3,716 ఫ్లాట్లకు 39,082 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపింది. ఇందులో బండ్లగూడకే 33,161 అప్లికేషన్లు వచ్చాయని ప్రకటించింది. లాటరీ పారదర్శకంగా జరుగుతుందని, లాటరీని యూట్యూబ్, ఫేస్ బుక్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తూ.. రికార్డ్ చేస్తామని హెచ్ఎండీఏ ప్రకటించింది. లాటరీ తీసిన తరువాత ఫ్లాట్ నంబర్, అప్లికెంట్ నేమ్ వెల్లడిస్తామని తెలిపింది. బండ్లగూడలో 345 త్రిబుల్ బెడ్ రూమ్ డీలక్స్ ఫ్లాట్లకు 16,679 అప్లికేషన్లు వచ్చినందున 29న ఈ లాటరీ తీస్తున్నట్లు ప్రకటించింది. ఫ్లాట్లు దక్కించుకున్న వారి వివరాలను www.hmda.gov.in, www.swagruha.telangana.gov.in  వెబ్ సైట్ లో 29 సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచుతామన్నారు. ఒక వ్యక్తి ఒకే ఫ్లాట్ కొనేందుకు అర్హులని, ఒక వేళ రెండు ఫ్లాట్స్ వస్తే రద్దు చేస్తామని వెల్లడించింది. ఫ్లాట్ దక్కించుకున్న వ్యక్తులు వారంలోగా 10 శాతం, 80 శాతం అమౌంట్ 2 నెలల్లో, మిగతా అమౌంట్ 3 నెలల్లోగా చెల్లించాలని హెచ్ఎండీఏ ప్రకటించింది.