లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి

లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి

ఖైరతాబాద్, వెలుగు: లండన్​లో ​జరగనున్న మేయర్​ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన తరుణ్ గులాటి పోటీ చేయనున్నారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బీజేపీ జాతీయ నేతలు కరుణ గోపాల్, అంకెం హరితో కలిసి మీడియాతో మాట్లాడారు.  తాను పుట్టింది ఢిల్లీలోనైనా పెరిగిందంతా లండన్ లోనేనని తరుణ్ వెల్లడించారు. 

లండన్​లో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ  స్వతంత్ర అభ్యర్థిగా 2024 లో  పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తాను మేయర్​గా విజయం సాధిస్తే.. భద్రతతో పాటు సంస్కృతిని పెంపొందించేలా కార్యాచరణ అమలు పరుస్తానని హామీ ఇచ్చారు. యూకేలో 18 లక్షల భారతీయులు ఉన్నారని, అందరి సహకారంతో తాను విజయ పథం వైపు అడుగులు వేస్తానని తరుణ్  ఆశాభావం వ్యక్తం చేశారు.