తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు

తెలంగాణలో లక్షకు చేరువలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,967 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 99,391 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 8 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 737కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1781 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 76,967గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,687 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 473, రంగారెడ్డి 202, మేడ్చల్ 170, జగిత్యాల 81, కరీంనగర్ 86, ఖమ్మం 79, నల్గొండ 60, నిజామాబాద్ 69, కామారెడ్డి 55, వరంగల్ అర్బన్ 101, గద్వాల్ 55, మంచిర్యాల 40, సంగారెడ్డి 38, పెద్దపల్లి 35, సిద్ధిపేట 49 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

చిన్న పట్టణాలకు మారుతున్న పెద్ద కంపెనీలు

గూగుల్‌ నుంచి సరికొత్త ‘కోర్మో’ జాబ్ యాప్

ఏ శిక్షకైనా రెడీ.. సారీ మాత్రం చెప్పను