రాష్ట్రానికి 3 డిజిటల్ ఇండియా అవార్డులు

రాష్ట్రానికి 3 డిజిటల్ ఇండియా అవార్డులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డిజిటల్ ఇండియా జాతీయ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. మూడు అవార్డులను అందుకుంది. వెబ్ రత్న విభాగంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ గోల్డ్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఔట్ స్టాండింగ్ డిజి టల్ ఇనిషియేటివ్ బై లోకల్ బాడీ కింద జీహెచ్‌ ఎంసీ ఆడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీకి ప్లాటినం అవార్డు స్వీకరించారు. బెస్ట్ మొబైల్ యాప్ విభాగంలో టీ-యాప్ ఫోలియోకి సిల్వర్ అవార్డును జి.టి.వెంకటేశ్వరరావు అందుకున్నారు. శుక్రవారం ఢిల్లీలోని స్టెయి న్ ఆడిటోరియంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అవార్డులను ప్రదానం చేశారు.