ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు మృతి

ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు మృతి

మూసాపేట్ అంజయ్య నగర్ లో విషాదం నెలకొంది. స్థానిక చెరువులో ఈతకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు బాలుడిని బయటకు తీశారు. తన కుమారున్ని చూసి బాలుడి తల్లి తల్లడిల్లిపోయింది. బతికించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. బాలుడ్ని పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.