రోడ్ల కోసం కిషన్ రెడ్డి చొరవ : రూ. 202 కోట్లు విడుదల చేసిన కేంద్రం

రోడ్ల కోసం కిషన్ రెడ్డి చొరవ : రూ. 202 కోట్లు విడుదల చేసిన కేంద్రం

తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న 202కోట్ల నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధుల కోసం పలుమార్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి చర్చించారు.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. నిధులు విడుదల చేసినందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని రోడ్లు దెబ్బతిన్న సమయంలో.. కేంద్రం నిధులు విడుదల చేయటం వల్ల మేలు కలుగుతుందన్నారు కిషన్ రెడ్డి.

తెలంగాణలో 8 జాతీయ రహదారులు 868 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. వీటి నిర్వహణకు, మరమ్మత్తుల కోసం  202 కోట్ల రూపాయల అంచనాలను JNHAI ఆమోదించింది. కేంద్రం విడుదల చేసిన నిధులు తెలంగాణ రాష్ట్ర ఆర్ అండ్ బి సమర్పించిన ప్రతిపాదనలకంటే.. 85 శాతం ఎక్కువన్నారు కిషన్ రెడ్డి. వర్షాలతో దెబ్బతిన్న రహదారులు మరింత పాడవకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ నిధులను సద్వినియోగపర్చుకోవచ్చన్నారు కిషన్ రెడ్డి. వరదలు, అకాల వర్షాలతో కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. రాష్ట్ర సర్కారు చేపట్టే మరమ్మతు, పునరావాస కార్యకలాపాలకు.. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.