బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై ఈరోజు హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఇరు పక్షాలు తమ వాదనలు హైకోర్టుకు వినిపించాయి. స్పీకర్ కు విచక్షణ అధికారం ఉంటుందని ఏజీ తన వాదనను వినిపించగా...అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పాటించలేదని బీజేపీ ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్ ప్రకాశ్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు. సస్పెన్షన్ పై స్టే విధించాలని కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇవాళ తీర్చు చెప్పనుంది.
మరిన్ని వార్తల కోసం