ఇకపై రైళ్లలో  దుప్పట్లు, కర్టెన్లు

ఇకపై రైళ్లలో  దుప్పట్లు, కర్టెన్లు

హైదరాబాద్‌, వెలుగు: ఇకపై రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లను అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా కారణంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోటోకాల్‌(ఎస్‌ఓపీ) ప్రకారం ప్రయాణికులకు రైళ్లలో దుప్పట్లు, కర్టెన్ల సరఫరాపై గతంలో నిబంధనలు విధించినట్లు, ప్రతస్తుం వైరస్‌ తీవ్రత తగ్గడంతో ఈ ఆంక్షలను ఎత్తేస్తున్నట్లు వెల్లడించింది. కరోనాకు ముందున్నట్లుగానే ప్రయాణికులకు ఈ సౌకర్యం అందించాలని ఇండియన్‌ రైల్వేస్ నిర్ణయించిందని తెలిపింది.