కిలాడీ లేడి...ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలో నుంచి చైన్ చోరీ

కిలాడీ లేడి...ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలో నుంచి  చైన్ చోరీ

హైదరాబాద్ లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఒంటిరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు.  ఈ మధ్య  యువతీ యువకులు కలిసి బైకులపై వెళ్తూ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు.

లేటెస్ట్ గా  ఉప్పర్ పల్లిలో  ఓ కిలాడి లేడీ చైన్ స్నాచింగ్ కు పాల్పడింది.  ఉప్పర్ పల్లిలో ఒంటిరిగా ఉంటున్న నర్సమ్మ అనే వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి   ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసింది.  రెండున్నర తులాల బంగారు చైన్ లాక్కెళ్లి పరారైంది. గమనించే లోపే లేడి పరుగెత్తింది.  స్థానికుల ఫిర్యాదుతో  ఘటనా స్థలానికి వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు  కేసు నమోదు చేశారు.  ఇంట్లో ఉన్న మహిళలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు వృద్దులను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లొద్దని చెప్పారు.