- బ్రిటన్ సంస్థ ఈఐయూ నివేదిక..
నెటిజన్ల షాక్ - బెంగళూరు చీప్ అయితే,
హైదరాబాద్ మాటేంటని ప్రశ్న
దేశంలో ఖరీదైన నగరాలేంటి అనగానే..
బెంగళూరు, ఢిల్లీ, ముంబై అంటూ గడగడ సమాధానాలు వచ్చేస్తాయి. కానీ, అదేంటో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) మాత్రం ముంబైని పక్కనబెడితే మిగతా రెం డు సిటీలు భలే చీపు అనేస్తోంది. బ్రిటన్ కు చెందిన ఆ కంపెనీ ప్రపంచంలోని
అత్యం త నివాసయోగ్యమైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో బెంగళూరు, ఢిల్లీతో పాటు చెన్నై కూడా చోటు సంపాదించింది.
బెంగళూరుకు 5వ స్థానం రాగా, చెన్నై 8, ఢిల్లీ పదో స్థానాల్లో నిలిచాయి. ఆదివారం ఈఐయూ ఆ నివేదికను ఆదివారం విడుదల చేసింది. దానిని వరల్డ్ ఇండెక్స్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఇక, ఈ జాబితాలో వెనెజులాకు చెందిన కరాకస్ సిటీ మొదటి స్థానంలో నిలవగా, సిరియాలోని డమాస్కస్ రెండో స్థానాన్ని సాధించింది. అయితే, బెంగళూరును లిస్టులో చేర్చే సరికి నెటిజన్లు షాక్ కు గురయ్యారు. చెన్నై, ఢిల్లీతో పోలిస్తే బెంగళూరు చాలా ఖరీదైన సిటీ అంటూ నెటిజన్లు వరల్డ్ ఇండెక్స్ పోస్ట్ చేసిన రిపోర్టుకు కామెంట్లు పెట్టారు. దేశంలో హైదరాబాద్ కన్నా చీపైన సిటీ ఇంకొకటి లేదంటూ ఓ వ్యక్తి కామెంట్ పెట్టాడు. హైదరాబాద్ , కోల్ కతా వంటి నగరాల్లో అయితే, డబ్బులు బాగా మిగులుతాయని ఇంకొందరు కామెంట్ చేశారు.