పోలీసులు కేసీఆర్ కు గులాంగిరి చేస్తున్నారు

పోలీసులు కేసీఆర్ కు గులాంగిరి చేస్తున్నారు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోలీసులు గులాంగిరి లాగా పనిచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతినే తీన్మార్ మల్లన్న చెప్తున్నడు..ప్రజలను చైతన్యం చేస్తుంటే.. తీన్మార్ మల్లన్న  నోరు ను ఏ విధంగా ముయించాలనే   పోలీసులను పంపారని ఆయన విమర్శించారు. సైబర్ క్రైమ్ పోలీసులు తీన్మార్ మల్లన్న ఆఫీసుకు వెళ్లి హల్చల్ చేశారని, ముఖ్యమైన డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లు  తీసుకొని వెళ్లారని ఆరోపిస్తూ.. తాను సైబర్ క్రైం పోలీసులకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా..  సమాధానం చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ‘‘నేను ఎన్నో సార్లు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసిన స్పందించలేదు. నాకు కాల్ చేసి చంపుతామని బెదిరించిన పట్టించుకోలేదు. బెదిరింపులకు పాల్పడిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదు..? కాల్ చేసి బెదిరించిన వాళ్లను ఎందుకు పట్టుకోలేదు ?  నేను పిర్యాదు చేసిన పట్టించుకోలేదు కానీ మరి తీన్మార్ మల్లన్న విషయంలో అంత ఇంట్రెస్ట్ ఏంటీ పోలీసులకు ? మాకు బెదిరింపు కాల్స్ వచ్చినా ఏమి పట్టించుకోరా.. ? అంత టైం ఉండదా..? కేసీఆర్ కు పోలీసులు గులాంగిరి చేస్తున్నారా? ..’’ అని ఎమ్మెల్యే రాజాసింగ్ నిలదీశారు.