కారు ముందు పడుకొని మహిళ హల్ చల్

కారు ముందు పడుకొని మహిళ హల్ చల్

 మెహిదీపట్నం, వెలుగు: ఓ మహిళ నడిరోడ్డుపై కారుకు అడ్డంగా పడుకొని, చనిపోతానంటూ హల్ చల్ చేసింది. సోమవారం సాయంత్రం దంపతులు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పక్కన బాలాజీ స్వీట్ హౌస్ సమీపంలో గొడవపడ్డారు. భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో క్షణికావేశానికి లోనైన మహిళ రోడ్డుపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వెళ్లి ఓ రన్నింగ్ కారు ముందు పడుకుంది. వెంటనే డ్రైవర్ మేలుకొని సడెన్ బ్రేక్ వేశాడు.  కొద్దిసేపటివరకు ఆమె కారు ముందు నుంచి లేవలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.

స్థానికులు ఆమెను వారించినా ఫలితం లేదు. చివరకు మరో మహిళ ఆమె వద్దకు వెళ్లి సముదాయించి రోడ్డు పక్కకు తీసుకెళ్లింది. అనంతరం ఏం జరిగిందని అడిగితే సమాధానం చెప్పలేదు. ఆమె చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది. భర్త వేధింపులతోనే భార్య కారు కింద పడేందుకు యత్నించిందని స్థానికులు అనుమానం వ్యక్తంచేశారు. దీనిపై పోలీసులకు  సమాచారం లేదు.